ఇప్పటి వరకు బ్రిటిష్ వారు భారత దేశాన్ని ఎలా ఆక్రమించారు,
బ్రిటిష్ వారు రాకముందు పరిస్థితుల గురించి మనం తెలుసుకొన్నాం . బ్రిటిష్ వారు ఇండియాకి వచ్చిన తరువాత వారివల్ల జరిగిన ప్రయొజనాల గూర్చి చర్చిద్దాం .
భారత దేశం ఏర్పడడానికి పరోక్షంగా బ్రిటిష్ వారు కారణం. అప్పటి వరకు ప్రజలు స్థానిక రాజులకు విధేయులుగా ఉండేవారు. బ్రిటిష్ వారి రాకతో స్థానిక రాజుల ప్రాభల్యం పోయి స్వాతంత్ర్యొద్యమ కాలం లొ ప్రజలు జాతీయ సమైక్యత వైపుకు మొగ్గు చూపారు. ఈ విధంగా భారతదేశం ఏర్పడింది.
ప్రస్తుతం మన రాజ్యాంగము లోని చాలా భాగం బ్రిటిష్ వారు రచించిన "1935 ప్రభుత్వ చట్టం" నుంచి గ్రహించినవే. ఇప్పుడు మనం చూస్తున్న చాలా చట్టాలు వారు వదిలి వెళ్ళినవే.
స్వాతంత్రొద్యమ కాలం లో వెనుకబడిన వర్గాలలో, దళితులలో చైతన్యం వచ్చి ప్రజా ఉద్యమల ద్వారా తమ హక్కులను పొం దగలిగారు. ఈ కాలం లోనె మహిళలు అన్ని రంగాలలొ ముందుకు కదిలారు.
అప్పటి వరకు భారతీయులు అన్ని రంగాలలో ప్రాచీన పద్దతులను
వాడుతూ ఉండేవారు. పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఈ రంగాలలో నూతన పద్దతులు ప్రవేశపెట్టడం జరిగింది. అనేక నూతన పరిశ్రమలైన ఇనుము ఉక్కు , కాగితం తయారి పరిశ్రమలు వచ్చాయి. బ్రిటిష్ వారు తమ వ్యాపార నిమిత్తం రైల్వేలకు అనేక రాయితీలను ఇచ్చి ప్రొత్సహించారు. కాని అవి వారికంటే మనకే
ఎక్కువ ఉపయెగపడ్డాయి. అలాగే టెలిఫోను , టెలిగ్రాఫ్ వ్యవస్థను వీరే అభివృద్దిపరిచారు.
అప్పట్లొ సతీసహగమనం అనే మూడాచారం ఉండెది. దీన్ని బ్రిటిష్ వారు నిషేదించారు , అలాగే బాల్య వివాహలను అమలు కాకుండా చట్టాలు చేశారు. ఒక విధంగా ఆ రోజుల్లొ చదువులు సామాన్యులకు కూడా అందాయంటె దానికి వీరే కారణం.
భారత బాషలలొ ఉన్న అనేక గ్రంధాలను తమ భాషలో కి
తర్జుమా చేసి ప్రపంచానికి అందించారు. భారత దేశానికి సంబంధించి
మరుగుపడిపోయిన అనేక విషయాలను వెలికితీశారు. బ్రిటిష్ వారిలొ కొంతమంది మహాను భావులు మన దేశానికి ఎనలేని సేవ చేశారు. వారిని సదా మనం గుర్తు చేసుకోవాలి.
మన దేశం లోని ఆర్దిక, సామాజిక , పారిశ్రామిక, రాజకీయ రంగాలలొ విప్లవాత్మక మార్పులు రావడానికి బ్రిటిష్ వారే కారణం.
నమస్తే .